వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించిన కవిత

  • బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్న కవిత
  • ప్రభుత్వం బాధితులకు అండగా లేదని విమర్శ
  • బాధితులతో కలిసి జెడ్పీ కూడలిలో ఆందోళన
  • పోలీసులు సర్దిచెప్పడంతో నిరసన విరమించిన కవిత
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖమ్మం నగరం జెడ్పీ కూడలిలో ఆందోళనకు చేపట్టారు. ఖమ్మంలోని అంబేద్కర్ భవనంలో వెలుగుమట్ల బాధితులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాధితులకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని అన్నారు.

ప్రభుత్వం ఇప్పటి వరకు బాధితులకు మద్దతుగా లేదని మండిపడ్డారు. ప్రభుత్వం తరఫున వారికి వైద్య సహాయం కూడా అందడం లేదని విమర్శించారు.

అనంతరం కార్యకర్తలు, బాధితులతో కలిసి జెడ్పీ కూడలిలో ఆందోళనకు దిగారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జెడ్పీ కూడలిలో రోడ్డుపై బైఠాయించారు. దీనితో రోడ్డుపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని, సర్ది చెప్పడంతో కవిత నిరసన విరమించారు.

Kalvakuntla Kavitha
Velugumatla victims
Khammam
Telangana Jagruthi
Victim Support
Protest

More Telugu News